ఒంగోలు అర్బన్: పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి లేదంటే పోరాటాన్ని ఉదృతం చేస్తాం : వైసీపీ మాజీమంత్రి మేరుగ నాగర్జున
Ongole Urban, Prakasam | May 16, 2026
కూటమి ప్రభుత్వం పండించిన పంటకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతుందని వైసిపి మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. శనివారం ఒంగోలు-2 పొగాకు వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్ళను పరిశీలించిన వైసిపి వైసీపీ నాయకులు అనంతరం మీడియాతో మాట్లాడారు. కంపెనీలు వాళ్ళు సిండికేట్ అయి తక్కువ ధరకు పొగాకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. పొగాకు రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటిస్తే పొగాకు కంపెనీలు మూసుకోవాలిసి వస్తుందనీ హెచ్చరించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని వైసిపి నాయకులు డిమాండ్ చేశారు.