శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా వైభవంగా స్వర్ణరథోత్సవ కార్యక్రమం
శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వర్ణరథోత్సవం వైభవంగా నిర్వహించారు.శ్రీమల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లకు వేకువజామున మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం లోకకల్యాణం కోసం ఆలయ అర్చకులు ప్రత్యేక సంకల్పం పఠించారు. దేశంలో శాంతి సౌభాగ్యాలు నెలకొనాలని, సకాలంలో వర్షాలు కురవాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. భక్తుల శివనామస్మరణ, వేదమంత్రాల నడుమ ప్రారంభమైన స్వర్ణరథోత్సవం గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, అక్కడి నుంచి తిరిగి గంగాధర మండపం వరకు కొనసాగింది.