గుంతకల్లు: మండలంలోని మైనాపురంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం, గుత్తి ఆసుపత్రికి తరలింపు
అనంతపురం జిల్లా గుంతకల్లు మండల పరిధిలోని మైనాపురం గ్రామంలో నిరంజన్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు, ఆసుపత్రి వర్గాలు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. మైనాపురం గ్రామానికి చెందిన నిరంజన్ అనే వ్యక్తి గత కొన్ని నెలలుగా కుటుంబసమస్యలతో పాటుగా అనారోగ్యసమస్యలతో బాధ పడుతుండేవాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన అతడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం రాత్రి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న నిరంజన్ ను గమనించిన కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.