అల్విన్ కాలనీ డివిజన్ లోని ఎల్లమ్మ చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. దీంతో స్థానికంగా నివాసితులు కూకట్పల్లి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసే పనిలో పడ్డారు. మహిళ ఎవరు అనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.