మహేశ్వరం పీఎస్ పరిధిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించారు. ఏసీపీ జానకి రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు జోహార్లు పలికారు. భారత్-చైనా యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లను స్మరించుకుంటూ ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ఏసీపీ తెలిపారు.