నీలంపల్లి గ్రామంలోని నాగలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా జరుపుకునేందుకు ప్రజలంతా సహకరించాలని సిఐ పుల్లయ్య తెలిపారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా నాగలింగేశ్వర స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.