సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్వరితగతిన వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. షాద్నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన అనంతరం మాట్లాడుతూ.. ప్రస్తుత ఆసుపత్రిలో ప్రాథమిక సదుపాయాల కొరత, పరికరాల పనితీరు దెబ్బతినడం బాధాకరమన్నారు. ఆసుపత్రిలో వైద్యులను నియమించి, రోగులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.