ఆళ్లగడ్డ: తీవ్ర వడగాల్పులు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, ఆళ్లగడ్డ ఎంపీడీవో నూర్జహాన్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రానున్న వారం రోజులు పాటు తీవ్ర వడగాల్పులు నమోదయ్యే అవకాశం ఉన్నందున ఆళ్లగడ్డ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆళ్లగడ్డ ఎంపీడీవో నూర్జహాన్ సూచించారు, అత్యవసర పరిస్థితుల్లో ఉంటే తప్ప బయటకి వెళ్ళవద్దని చిన్న పిల్లలు వృద్దులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు, తగినంత నీరు మజ్జిగ పళ్ళ రసాలు తీసుకుంటూ శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలన్నారు, మధ్యాహ్నం సమయంలో బయట పనులు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని ఆమె కోరారు