తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కౌలు రైతులు ఉరవకొండ రెవెన్యూ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం నాయకులు మాట్లాడారు. ప్రతి కౌలు రైతుకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల దాకా పంట రుణాలు ఇవ్వాలన్నారు. రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20వేల రూపాయలు ఇవ్వాలని, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రెవెన్యూ అధికారులకు అందజేశారు.