శంషాబాద్ ఎయిర్పోర్టులో గురువారం డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. సార్జా నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి వద్ద రూ.2.37 కోట్ల విలువచేసే బంగారం గుర్తించారు. లగేజీ బ్యాగ్లో తరలిస్తున్న 1798 గ్రాముల 7 బంగారం కడ్డీలను సీజ్ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.