కనిగిరి : అందుల ఆశాజ్యోతి లూయిస్ బ్రెయిలీ జయంతి కార్యక్రమాన్ని కనిగిరి పట్టణంలోని దివ్యాంగుల హక్కుల ఐక్యవేదిక కార్యాలయం ఆవరణలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు సురేష్ రెడ్డి దివ్యాంగులతో కలిసి లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ... అందుల కోసం లిపిని కనిపెట్టి అందులో జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ అన్నారు. అందుల పట్ల ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో మెలగాలన్నారు.