ఒంగోలు అర్బన్: ప్రజల అవసరాలు గుర్తించేందుకే స్వీయ గణన కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేపట్టింది: ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు
Ongole Urban, Prakasam | Apr 16, 2026
ప్రజల అవసరాలు తెలుసుకునేందుకు కూటమి ప్రభుత్వం స్వీయ గణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. గురువారం తన నివాసంలో స్వీయ గణన పోర్టల్ లో తన వివరాలను ఎమ్మెల్యే పొందుపరిచారు. ఈనెల 30వ తేదీ వరకు ఈ పోర్టల్ లో ప్రజలు తమ వివరాలు పొందుపరచాలని తర్వాత మే 1వ తేదీ మంచి అధికారులు ఈ అప్లికేషన్లు వెరిఫికేషన్ చేస్తారన్నారు. మూడు విభాగాల అధికారులు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారన్నారు. ప్రజల అవసరాలు తీర్చేందుకు ఈ సర్వే చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు.