నందికోట్కూరు: వేల్పనూరు వెలుగోడు రహదారిలో రెండు బైకులు ఎదురెదురు ఢీ..ఒకరి దుర్మరణం
నంద్యాల జిల్లా వేల్పనూరు వెలుగోడు రహదారిలోని మంచినీళ్ల వాగు వద్ద ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది, రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి, ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి, వారిలో ఒకరు మృతి చెందినట్లు సమాచారం, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెలుగోడు లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు, ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది