ఒంగోలు అర్బన్: మాజీ సీఎంని ప్రజలు చిదరించిన ఇంకా సిగ్గు రాలేదు: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
Ongole Urban, Prakasam | Apr 15, 2026
ప్రజలు చిదరించిన మాజీ సీఎం కి ఇంకా సిగ్గు రాలేదని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. ఒంగోలులో జరిగిన ఓ మీడియా సమావేశంలో మంత్రి స్వామి మాజీ సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాకు జగన్ ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. జాలర్లను రెచ్చగొట్టేందుకే ఆయన అక్కడికి వెళ్లారని ఆ ప్రాంతంలో వారు ఎవరూ రాలేదని మా ప్రాంతం నుంచి 50 మందిని తీసుకోవాలని జరిగిందన్నారు. తన తండ్రి హయాంలో పోర్టు కట్టవలసిన అవసరం లేదని జీవో ఇచ్చాడని తమ ప్రభుత్వంలో జాలర్లు అందరికి మేలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.