జిల్లాలో పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టు పనులను తక్షణం పూర్తి చేయాలని సంబంధిత శాఖలకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం ఆయన వెలిగల్లు ప్రాజెక్టు, HNSS ప్రధాన పంపింగ్ స్టేషన్ మరియు శ్రీనివాసపురం రిజర్వాయర్లను పరిశీలించారు.అధికారుల వివరాల ప్రకారం వెలిగల్లు ప్రాజెక్ట్ సామర్థ్యం 4.64 టీఎంసీలు, ప్రస్తుత నిల్వ 4.15 టీఎంసీలు. కుడికాలువ ద్వారా 23,400 ఎకరాలు, ఎడమకాలువ ద్వారా 600 ఎకరాలకు సాగునీరు అందుతున్నట్లు తెలిపారు. కాలువల పునరుద్ధరణకు అంచనాలు తయారు చేయాలని కలెక్టర్ సూచించారు.శ్రీనివాసపురం రిజర్వాయర్ సామర్థ్యం 1.02 టీఎంసీలు కాగా, కాలువల చిన్నపాటి పెండ