పెద్ద కడబూరు: మండల కేంద్రంకు చెందిన వైసీపీ కార్యకర్త కోరి లింగన్న గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి మంగళవారం లింగన్న మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అదేరా పడవద్దని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.