సమిష్టిగా సమన్వయంతో పని చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి చెప్పారు. బంగారు పథకాన్ని సాధించడం ద్వారా ఎర్రగొండపాలెం యాస్పిరేషనల్ బ్లాక్ సాధించిన విజయమే దీనికి నిదర్శనమని అన్నారు. ఈ విజయంలో భాగస్వాములైన ప్రభుత్వ సిబ్బందికి అభినందన కార్యక్రమాన్ని జిల్లా ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి పాల్గొన్నారు.