అనంతపురం అర్బన్: దాడి జరిగిన ఘటనకు సంబంధించి కేసు పెట్టడంతో వెంకటాపురం గ్రామంలో దంపతులపై దాడి
Anantapur Urban, Anantapur | Apr 5, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలం వెంకటాపురం గ్రామంలో పరశురాముడు అతని భార్య చిలకమ్మపై యశ్వంత్ రాజశేఖర్ రామాంజి మంజుల వేటకొడవల్ల తో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.