నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ బీజేపీ నాయకులు బుధవారం మద్దిలేటి స్వామి ఆలయ ఈవోను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై విస్తృతంగా చర్చించారు. తాగునీరు, సచివాలయాలు, క్యూలైన్లు, నీడ ఏర్పాట్లు వంటి ప్రాథమిక సౌకర్యాలతో పాటు మరిన్ని వసతులను మెరుగుపరచాలని ఈవోను కోరారు. డోన్ మండల బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.