న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. నూతన గౌరవాధ్యక్షుడిగా ఎన్నికైన విష్ణువర్ధన్ రెడ్డిని సంగారెడ్డి అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం సన్మానించారు. ఉపాధ్యక్షుడు భూపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేష్, కార్యవర్గ సభ్యులు మల్లేశం, శ్రీకాంత్, శ్రీనివాస్, మంజుల రెడ్డి, బుచ్చయ్య, సుభాష్ చందర్, నరసింహ, మాణిక్ రెడ్డి పాల్గొన్నారు.