కృష్ణాజిల్లా గన్నవరం (M) కేసరపల్లిలో సంక్రాంతి కోడిపందేలు హైటెక్ హంగులతో సాగుతున్నాయి. పందెపు బరిలో జరిగే పోరును ప్రతి ఒక్కరూ స్పష్టంగా వీక్షించేందుకు నిర్వాహకులు భారీ LED స్క్రీన్లను ఏర్పాటు చేయడం విశేషం. ఈ డిజిటల్ తెరలపై పందేలను ప్రత్యక్ష ప్రసారం చేస్తుండటంతో పందెపు రాయుళ్లు, వీక్షకులు భారీగా తరలివస్తున్నారు. సాంకేతికతను జోడించి నిర్వహిస్తున్న ఈ పందేల తీరు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.