ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు కొద్దిగ రోజులుగా జరుగుతున్నాయి. మంగళవారానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ జట్లు సెమీఫైనల్కు చేరుకున్నట్లుగా పోటీల నిర్వాహకులు తెలిపారు. జాతీయ స్థాయి క్రీడలకు సింగరాయకొండ మండలం వేదిక కావడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉత్కంఠ పరీతంగా సాగుతున్న కబడ్డీ పోటీలను స్థానిక ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.