యల్లంపల్లి గ్రామంలో పాఠశాల చిన్నారులతో కలికిరి అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ సీఐ కె.రామచంద్ర బుధవారం ముచ్చటించారు. కలికిరి మండలం గుట్ట పాలెం పంచాయతీ యల్లంపల్లి గ్రామంలోని ప్రాధమిక పాఠశాలను సీఐ కె.రామచంద్ర సందర్శించారు. విద్యార్థుల్లో గల నైపుణ్యాల గురించి ఆరా తీశారు. చిన్నారులకు వారి తల్లిదండ్రుల పేరు,గ్రామం, ఫోన్ నంబర్లు తెలుసా, ఎక్కడైనా వెళ్లేటపుడు ఐడి కార్డులు తీసుకెళతారా అని విద్యార్థులను అడిగి కొంత సేపు మాటామంతీ కలిపారు.