సోమవారం సాయంత్రం ఐదు గంటల నుంచి నెల్లూరులోని ఏసీ స్టేడియంలో శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ కళ్యాణాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తులకు పోలీస్ శాఖ పలు సూచనలు చేసింది. ద్విచక్ర వాహనదారులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పార్కింగ్ ఏర్పాటు చేశామని ప్రతి ఒక్కరూ అక్కడే బైకులను పార్క్ చేసుకోవాలని దర్గామిట్ట సిఐ కళ్యాణ్ రాజు సూచించారు. పోలీస్ శాఖకు సహకరించాలని ఆదివారం రాత్రి 8 గంటలకు విజ్ఞప్తి చేశారు.