అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని శక్తి టీం సభ్యులు తెలిపారు. శనివారం బలపనూరు ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు గుడ్ బ్యాడ్ టచ్ లతోపాటు, అపరిచిత వ్యక్తుల గురించి అవగాహన కల్పించారు. ఎవరైనా తెలియని వ్యక్తులు, పిలిస్తే వెళ్ళవద్దని, వారిచ్చిన తిను బండరాలను తీసుకోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల శక్తి టీం సభ్యులు ప్రసాద్, రఫీ, వెంకటేశ్వర్లు, మహిళా పోలీస్ మౌనిక ఉపాధ్యాయులు పాల్గొన్నారు.