జమ్మలమడుగు: జమ్మలమడుగు : శ్రీ బాలాత్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు
కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.నేడు గురువారం 4వ రోజు శ్రీ బాలాత్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్బంగా ఆలయ పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తీర్థప్రసాదాలు భక్తులకు అందజేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.