అనంతపురం నగరంలోని నీరుగంటి వీధికి చెందిన భాను స్టూడియో యజమాని సుమారు 8 కోట్ల వరకు అప్పులు చేసి చెల్లిస్తానని చెప్పి రాత్రికి రాత్రి ఇంటికి తాళం వేసి కనుమరుగయ్యాడు. దీంతో ఆదివారం పెద్ద ఎత్తున ఇంటి వద్దకు చేరుకుని బాధితులు లబోదిబోమంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతరం వారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులను సంప్రదించారు.