ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని బిలాల్ నగర్ లో పేకాట ఆడుతున్న ఐదు మందిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.9,800 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పేకాట ఆడుతున్న వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశామని పేకాట ఆడటం చట్టరీత్య నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.