అనంతపురం నగర శివారులోని ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి జేఎన్టీయూ బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న సాయి రాజ్ అనే విద్యార్థి మృతి చెందాడు. మృతుడు గుత్తి మండలంలోని బసినేపల్లి గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి రైల్వే పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.