వెంకటాచలం మండలం, పుంజూలూరుపాడు గ్రామంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థాయికి మించి మాట్లాడవద్దని చెబితే దళితుడైన గోపాల్ గొంతు కోస్తారా అని కాకాణి ప్రశ్నించారు. సర్వేపల్లిలో పోలీసు వ్యవస్థ ప్రజల కోసం కాకుండా, అధికార పార్టీ నాయకుల కోసం పనిచేస్తుందనీ బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.