ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో మద్యం తాగి వాహనం నడుపుతున్న ఓ వ్యక్తిపై శనివారం పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మద్యం తాగి వాహనం నడిపితే వాహనదారుడు కి జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని ఎస్ఐ నరసింహారావు మీడియాకు తెలిపారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించినట్లు ఎస్సై వెల్లడించారు.