ప్రకాశం జిల్లా లోని సముద్ర తీరంలో సముద్రమలలు ఎగిసిపడుతున్నాయి. ఆదివారం సాయంత్రం స్థానిక అధికారులు పర్యటకులను ఎవరిని సముద్రంలోకి అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ఈనెల 29వ తేదీ వరకు తుఫాను కారణంగా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో సముద్రపు అలలు తాకిడి అధికంగా ఉందని అందుకని పర్యటకులను ఎవరిని సముద్రంలోకి ఈతకు వెళ్లకుండా నిరోధిస్తున్నట్లు అన్నారు. అలానే కార్తిక మాసం నేపథ్యంలో భక్తులు సముద్రంలో స్థానమాచరించకుండా తమ నివాసంలోనే దైవ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.