రామతీర్థం సముద్ర తీరం వద్ద సందడి విడవలూరు మండలంలోని రామతీర్థం సముద్ర తీరం వద్ద సందడి వాతావరణం నెలకొన్నది. కార్తీక మాసంలో వచ్చే ఆఖరి సోమవారం సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో సముద్రతీర ప్రాంతానికి విచ్చేశారు. భక్తులు సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రసాదాలను స్వీకరించారు.