అనంతపురం జిల్లా పాపంపల్లిలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి యువకుడికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Nov 11, 2025
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని సెట్టూరు మండలం పాపం పల్లి లో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో వన్నూరు స్వామి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.