ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 98 మంది లబ్ధిదారులకు రూ.50 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎంపీ పుట్టా మహేశ్ మంగళవారం ఏలూరులో పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు సుమారు రూ.5.50 కోట్ల నిధులను పేదలకు అందించామని తెలిపారు. సాయం కోసం కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని ఎంపీ స్పష్టం చేశారు.