నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలంలోని ఆయా గ్రామాల మహిళా పోలీసులతో శనివారం దొర్నిపాడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రామిరెడ్డి సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ఎస్సై రామిరెడ్డి మాట్లాడుతూ మహిళలు, బాలికలపై వేధింపులు ఘర్షణలు, వంటివి జరిగితే వెంటనే స్టేషన్లో తెలియజేయాలన్నారు, గ్రామాల్లో ప్రతిరోజు జరిగే ప్రతి విషయాన్ని సాయంత్రంలోపు స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు, ప్రతి ఒక్కరితో కలిసి మెలిసి ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మహిళా పోలీసులకు ఎస్సై రామిరెడ్డి సూచించారు