హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీని విజయవంతం చేయండి : ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి
Ongole Urban, Prakasam | Mar 27, 2026
హనుమాన్ సేవాసమితి ఆధ్వర్యంలో మే 17వ తేదీన జరగబోయే హనుమాన్ శోభాయాత్ర భారీ బైక్ ర్యాలీ పోస్టర్ ను శుక్రవారం ఒంగోలు ఎంపీమాగుంట శ్రీనివాస్ రెడ్డి విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సెక్రటరీ వెంకటేశ్వర రెడ్డి నగర అధ్యక్షులు బత్తిన మహేష్ విభాగ్ సంపర్క ప్రముఖ్ వెంకటేశ్వరరావు హనుమాన్ సేవా సమితి అధ్యక్షులు రావులపల్లి నాగేంద్ర యాదవ్ ప్రధాన కార్యదర్శి మఠంపల్లి దుర్గేష్ కార్యదర్శి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బైక్ ర్యాలీని ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు