నిర్మల్: స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్ఐఆర్) నిర్వహణకు అధికారులు సన్నద్ధంగా ఉండాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్
Nirmal, Nirmal | Sep 15, 2025 స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్ఐఆర్) నిర్వహణకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ 2002 పై రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్ రెడ్డి హైదరాబాదు నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఓటర్ జాబితాలో డూప్లికేట్ ఓట్లు, నకిలీ ఓట్ల తొలగింపుకు 20 నుంచి 25 సంవత్సరాలకు ఒకసారి స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో చివరగా 2002 లో ఎస్ఐఆర్ చేయడం జరిగిందని తెలిపారు. ఎస్ఐఆర్ నిర్వహణపై మాస్టర్ ట్