జిల్లాలో శాంతిభద్రతలకు పరిరక్షించడంలో పోలీసు యంత్రాంగం సమర్థంగా విధులు నిర్వహించాలని ఎస్పీ సునీల్ షోరాన్ సూచించారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్పై ప్రజల్లో విస్తృతఅవగాహన కల్పించాలని ఆదేశించారు.