ఉప్పల్ ఏబీవీపీ నగరశాఖ ఆధ్వర్యంలో 8,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించి, రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. నగర కార్యదర్శి సంతోషి మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కరించకపోతే రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.