గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అడిగిన వెంటనే అపర దాన కర్ణుడిలా సీఎం చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేస్తున్నారని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్యముల అశోక్ రెడ్డి అన్నారు. పట్టణంలోని టిడిపి కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి దాదాపు 100 మందికి రూ.54 లక్షలు విలువచేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారికి సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు.