రేణిగుంటలో కోటి సంతకాల సేకరణ ప్రారంభం ప్రభుత్వ మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో రేణిగుంటలో కోటి సంతకాల సేకరణ ప్రారంభమైంది. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటీకరణతో పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారని తెలిపారు. వెంటనే PPP విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఇదే అంశంపై ఈనెల 11న ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు.