నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు, ఈ కార్యక్రమానికి నందికొట్కూరు నియోజకవర్గం లోని డప్పు కళాకారులు నంద్యాల జిల్లాలోని డప్పు కళాకారులు హాజరై సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా చేపట్టారు, ఈ సందర్భంగా జిల్లా నాయకులు యేసు రత్నం, కెవిపిఎస్ రాష్ట్ర నాయకురాలు రంగమ్మ, గంధం హుస్సేన్ అమ్మ, కెవిపిఎస్ మిడుతూరు మండల కార్యదర్శి లింగస్వామి హాజరయ్యారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డప్పు కళాకారుల పెన్షన్ నమోదు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు