చెరువు కలుజుకు అడ్డంగా ఉన్న ప్రహరీ తొలగింపు రేణిగుంట మండలం కుర్రకాలువ గ్రామం చెరువు కలుజుకు అడ్డంగా నిర్మించిన ప్రహరీ గోడను తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి సోమవారం JCB సాయంతో తొలగించారు. సర్వే నంబర్ 28 చెరువు పొరంబోకు భూమిగా ఉందని, చెరువు నిండినప్పుడు సహజంగా సర్వే నంబర్ 18 ఫ్రీహోల్డ్ భూమి వైపు నీరు ప్రవహిస్తుందని తెలిపారు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యక్తులు కలుజుకు అడ్డంగా నిర్మించడం వల్ల పద్మనగర్ ఇళ్లకు ముంపు ప్రమాదం ఏర్పడిందన్నారు.