మార్కాపురం జిల్లా కంభం పట్టణంలోని పలు ఏరియాల్లో గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ వెంకట నరసయ్య తెలిపారు. ట్రాన్స్ఫారం దిమ్మెలు, ఇన్ లైన్ పోల్స్ తదితర మరమ్మత్తుల కారణంగా పట్టణంలోని కొండయ్య రైస్ మిల్ ఏరియా, బెస్త కల్యాణ మండపం ఏరియా, మేదర వీధి ఆంజనేయస్వామి గుడి వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు. ఈ అంతరాయానికి ప్రజలు సహకరించాలని కోరారు.