మెస్సి, రాహుల్ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు సిపి సజ్జనార్ తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఫలక్నామా ప్యాలెస్ కు మెస్సి, రాహుల్, సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారన్నారు. కోల్కతా ఘటన నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామని, రాచకొండ కమిషనర్ ఎప్పటికప్పుడు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నట్లు సజ్జనార్ స్పష్టం చేశారు.