సిద్దిపేట జిల్లా కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారి ఆలయంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే స్వామివారిని ఆలయం నుండి కల్యాణ మండపం వరకు పల్లకిలో ఊరేగింపుగా తీసుకువచ్చారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, కన్నుల పండుగగా స్వామివారి కల్యాణంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.