ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని గుంటూరు రోడ్డులో గురువారం రాత్రి రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో రెండు కార్లల్లో ప్రయాణిస్తున్న ఇద్దరికీ గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని 108 అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ప్రమాదంపై సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.