తాడిపత్రి మండలం ఆలూరు కోన లో వెలిసి ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో శనివారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అర్చనలు, అభిషేకాలు, హారతి వంటి పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వినియోగం చేశారు. ఆలయంతో పాటు పరిసరాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.