భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ షామీర్పేట నివాసంలో యూనిటీ మార్చ్ పోస్టర్ను ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలో మేరా యువ భారత పేరిట ఐక్యత పాదయాత్రలు, పోటీలు జరుగుతాయన్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డ ఈటెల రాజేందర్ ముంతా తుఫాన్ హెచ్చరికలు పట్టించుకోక నష్టం వాటిల్లేలా చేశారని ధ్వజమెత్తారు.